

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అరణ్య శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ “హనుమాన్ మిషన్” పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. “HANUMAN” (Healing And Nurturing Units for Monitoring, Aid & Nursing of Wildlife) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టు లక్ష్యం — మనుషుల మరియు అడవి జంతువుల మధ్య తలెత్తే ఘర్షణలను తగ్గించడం, జంతువుల సంరక్షణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం.
పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు వివరాలను సమీక్షించి, ఫారెస్ట్ అధికారుల నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 11 కీలక అంశాలను తెలుసుకున్నారు. ప్రతి అంశంపై జాగ్రత్తగా స్పందించిన ఆయన, ప్రాజెక్టును సమయపాలనతో అమలు చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సూచించారు. అలాగే, అడవి జంతువుల కదలికలపై ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారం అందించేందుకు ఆధునిక మొబైల్ యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఈ యాప్ను మార్చి 3నాటికి విడుదల చేయాలని సూచించారు.
ఫారెస్ట్ శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, తోటల శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆయన అన్నారు. “హనుమాన్ మిషన్” ద్వారా అడవుల్లో వన్యప్రాణులకు అనుకూల వాతావరణం కల్పించడం, మనిషి-జంతు ఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.










కామెంట్స్ (2)
ఇలాంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి.
వన్యప్రాణి సంరక్షణకు పవన్ కళ్యాణ్ సరికొత్త అడుగు.