

బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో బీజేపీ – శివసేన మహాయుతి కూటమి సాధించిన చారిత్రక విజయంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి తెరపడటం ప్రజల స్పష్టమైన తీర్పు అని పేర్కొన్నారు. ఈ ఘన విజయం తమందరికీ గర్వకారణమని చెప్పిన కంగనా, ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా 2020 లో తన ముంబై బాంద్రా కార్యాలయాన్ని కూల్చిన ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించారు. తనను వేధించిన వారిని, ఇంటిని కూల్చేసిన వారిని, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని ప్రజలే తిరస్కరించారని అన్నారు. మహిళా విద్వేషులు, బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు అని వ్యాఖ్యానించారు. అప్పట్లో బీఎంసీ కూల్చివేతలను ముంబై కోర్టు తప్పుపట్టి, వాటిని నిలిపివేయడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


_1771477764226.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!