

భారతదేశం పై 50 శాతం టారిఫ్లు విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం పై అమెరికా చట్టసభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను తక్షణమే రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, రాజా కృష్ణమూర్తి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
భారతం పై విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని, ఇవి భారత్–అమెరికా మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని వారు విమర్శించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సభ్యులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కూడా అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ పై అక్కడ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆయన్నే ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని, ఇది ఆయనకు రాజకీయంగా ఎదురుదెబ్బ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!