

సుస్థిర అభివృద్ధిని కొనసాగించడంతో పాటు ఆర్థిక సంస్కరణలకు వేగం కల్పించడమే లక్ష్యంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను సమర్పించనున్నారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం కాగా, స్వాతంత్య్రానంతరం ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
దేశీయ వినియోగం మందగించడం, ద్రవ్యోల్బణం కొంత తగ్గినా ఆర్థిక ఒత్తిడులు కొనసాగడం, అంతర్జాతీయ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ఈ బడ్జెట్పై ప్రభావం చూపే అవకాశముంది. ఉపాధి అవకాశాలు పెంచడం, ద్రవ్యలోటును నియంత్రించడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడం ప్రభుత్వానికి ప్రధాన సవాళ్లుగా మారాయి.
వ్యయాల విషయంలో వెనక్కి తగ్గకుండా మౌలిక వసతులు, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, పట్టణ రవాణా వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని అంచనాలు ఉన్నాయి. చిన్న పరిశ్రమలకు మద్దతు, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్తు రవాణా వంటి రంగాల ప్రోత్సాహానికి చర్యలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నులో స్వల్ప ఊరట ఉండొచ్చన్న అంచనాలున్నా, పెద్ద పన్ను మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!