
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్కు ఆపరేషన్ జరిగిన సమయంలో ఆయనను గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి పంపించామని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారని తెలిపారు. ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కృతి కాంగ్రెస్దేనని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
కేసీఆర్కు చెడు జరగాలని హరీశ్ రావు పూజలు చేస్తారని కవిత గతంలో చెప్పిన విషయాన్ని మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. కేసీఆర్కు చెడు కోరుకునేది బయటివారు కాదని, ఆ కుటుంబ సభ్యులేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు స్పందిస్తూ మహేశ్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!