

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న సర్పంచ్ ఎన్నికల మూడో, చివరి దశ ఈ రోజు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుండటంతో, ఓటర్లు ఉదయమే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ తుది విడతలో రాష్ట్రంలోని 182 మండలాల్లో ఉన్న 3,752 గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 12,652 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగానే, రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి రెండు విడతల్లో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు మరియు పోలీసు బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!