

మూసీ నదిని ప్రక్షాళన చేయడం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. మూసీ నది కాలుష్యం కారణంగా ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మూసీ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు.
మొదటి దశలో గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపడతామని సీఎం తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ప్రాజెక్టు అంచనాలను ఖరారు చేస్తామని, ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ.4,100 కోట్ల రుణం లభిస్తుందని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
గంగా, యమునా నదుల ప్రక్షాళన ఉదాహరణలను ప్రస్తావించిన సీఎం, మూసీ నదిని కూడా అదే స్థాయిలో పునరుద్ధరిస్తామని అన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి మూసీ, ఈసా నదులను నింపుతామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!