

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఐక్యత మరో 15 ఏళ్లపాటు ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గత 20 నెలలుగా కూటమి నాయకత్వంలో ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంతో పనిచేయడం శుభపరిణామమని పేర్కొంటూ, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఎలా పనిచేశామో అదే నిబద్ధతతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని అన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పనిసరిగా హాజరై అర్థవంతమైన చర్చలు జరపాలని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరగాలి, సభ్యులు చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించేలా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!