
సినిమాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీతో పొత్తుపై కీలక స్పష్టత వచ్చింది. రెండు పార్టీల మధ్య ఉన్న పాత మైత్రి కొనసాగుతుందని, ఎన్నికల్లో కలిసి పోటీ చేసే నిర్ణయం యథాతథంగా ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వం వెల్లడించింది. ఈ అనుబంధం దీర్ఘకాలిక రాజకీయ సహకారానికి నిదర్శనమని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఇక మిత్రపక్షంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని తమ పార్టీ నాయకులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించే విధంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో పరస్పర గౌరవం, సమన్వయం అత్యంత ముఖ్యమని నాయకత్వం సూచించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!