

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ప్రత్యేక సలహాదారులుగా నియమితులైన ఇద్దరిలో తెలుగువారైన విష్ణువర్ధన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైన విష్ణువర్ధన్ రెడ్డిని, జాన్ ఆరోక్యసామితో కలిసి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక సలహాదారులుగా నియమించింది. ఈ నియామకం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని ఎర్రదొడ్డిపల్లెకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, గ్రానైట్ వ్యాపార రంగంలో కొనసాగుతూ సుమారు 15 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. వ్యాపార రంగంలోనే కాకుండా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లోనూ మంచి పరిచయాలు ఏర్పరుచుకున్న ఆయన, విజయ్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
టీవీకే పార్టీ వ్యూహకర్తల్లో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అలాగే విజయ్ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో సహాయకారిగా ఉన్నారని, ఆయన సినిమాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా చూసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ప్రత్యేక సలహాదారుగా నియామకం కావడంతో తమిళనాడు రాజకీయాల్లో ఆయన పేరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!