
గాసిప్స్

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. మంగళవారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ కార్యకర్తలు వైసీపీ బాటలో నడవవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రణాళికాబద్ధంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి ట్రాప్లకు దూరంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!