
ఆంధ్రప్రదేశ్లోని గ్రామపంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. వచ్చే నెల 2వ తేదీ తర్వాత నుంచి ఈ పాలన అమలులోకి రానుందని సమాచారం. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులు పంచాయతీలను నిర్వహించనున్నారు.
సర్పంచుల పదవీ కాలం వచ్చే నెల 2తో ముగియనుండగా, ఎన్నికలు తక్షణం నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!