
రాజకీయాలు

తల్లిదండ్రులను పోషించడంలో నిర్లక్ష్యం చేసే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో తెలంగాణ కేబినెట్ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం కుటుంబ బాధ్యతలను బలోపేతం చేయడమే కాకుండా సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికీ కీలకంగా భావిస్తున్నారు.
ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం లేదా ₹10,000లో తక్కువ మొత్తాన్ని నేరుగా కట్ చేసి వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. ఈ చర్య వృద్ధుల ఆర్థిక భద్రతకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!