

అమెరికా–ఐరోపా సంబంధాలు దృఢంగా కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. మ్యూనిక్ భద్రతా సదస్సులో మాట్లాడిన ఆయన, అమెరికా పునాదులు యూరప్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఐరోపా దేశాలతో తమ మైత్రి బంధం చిరకాలంగా కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా అది మారదని రూబియో భరోసా ఇచ్చారు. అమెరికా ఎప్పటికీ ఐరోపాతో సన్నిహిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
అయితే అట్లాంటిక్ కూటమితో ఉన్న అనుబంధాన్ని పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కూటమి వ్యవస్థను కొత్త కోణంలో చూడాలని తమ దేశం భావిస్తోందని తెలిపారు.
గత ఏడాది నుంచి నాటో కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రూబియో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో అమెరికా విదేశాంగ విధానంపై మరోసారి చర్చ ప్రారంభమైంది.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!