

సింగరేణి కుంభకోణంపై గవర్నర్కు బీఆరెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉందని, వారి లూటీకి సంబంధించి సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక నుఅందచేశారు. మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ ను కేటీఆర్ హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు కలిశారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో జరిగిన టెండర్ల వ్యవహారాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా సోలార్ పవర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సింగరేణిని కొంతమంది కబళించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
సైట్ విజిట్ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వాస్తవంగా ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయో వివరాలు అడిగినా ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. ఆధారాలతో సహా కుంభకోణాలను బయటపెట్టినా అధికార పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ అంశంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరామని, న్యాయం జరగకపోతే కార్మిక లోకాన్ని కదిలిస్తామని ఆయన హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!