
సినిమాలు

హైదరాబాద్లో బీజేపీ జాతీయ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ నేతలు పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్ర నేతల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగానే తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా తమ విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని రాజాసింగ్ సూచించారు. వ్యక్తిగత, వర్గపరమైన రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలంటే నాయకుల మధ్య సమన్వయం, ఐక్యత ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!