

తెలంగాణ కాంగ్రెస్లో నూతన ఉత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్లో నిర్వహించే డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి 10:20 గంటలకు హెలికాప్టర్ ద్వారా వికారాబాద్కు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ చేరుకుని హరిత హోటల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పర్యటనలో కేవలం శిక్షణ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాల పై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఖరారు చేసే అవకాశముంది.
అదనంగా, మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో కూడా రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారితో చర్చించనున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!