

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల పక్కన నిలుస్తూ మానవీయతను చాటుకున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. పంటలు నాశనం అయిన రైతులను స్వయంగా పరామర్శించిన పవన్, కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని వరి పొలాల్లోకి అడుగుపెట్టారు. బురదలో తడుస్తూ, పంట నష్టాన్ని దగ్గరగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, “ప్రభుత్వం మీతో ఉంది – నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందుతుంది” అని భరోసా ఇచ్చారు. తుఫాను సమయంలో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని, కానీ పంటలు మరియు ఇళ్లకు భారీ నష్టం జరిగినట్లు గుర్తించిన పవన్, రైతుల పునరావాసానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
అనంతరం అవనిగడ్డ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన తుఫాను ప్రభావ ఫోటో ఎగ్జిబిషన్ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కలెక్టర్ బాలాజీతో మాట్లాడి జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అన్ని మంత్రులు తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అందుకే ప్రాణ నష్టం జరగలేదు. కానీ పంటలు, ఇళ్లు దెబ్బతిన్న రైతులకు న్యాయం తప్పక చేస్తాం” అని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నష్టాల అంచనా (Enumeration) ప్రక్రియను ప్రారంభించిందని, ప్రతి రైతుకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల బాధను అర్థం చేసుకుంటూ, బురదలో అడుగుపెట్టి పరిశీలించిన పవన్ కళ్యాణ్ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (3)
True leader with a kind heart
It touches heart
రైతుల కోసం బురదలోకే దిగిన నాయకుడు