
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఉన్నప్పటికీ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన గైర్హాజరు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదివరకు జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వరుసగా కేబినెట్ సమావేశాలకు గైర్హాజరవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!