

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నిప్పులు చెరిగారు. పదేళ్ల కాలంలో వారు చేసిన "పాపాల చరిత్రను" ఎవరూ చెరిపివేయలేరని, ఆ చరిత్రను ప్రజల ముందు కేసీఆర్ను శుక్రాచార్యుడితో పోల్చిన రేవంత్, ఆయన తన ఫామ్ హౌస్ నుంచి ఊర్ల మీదకు మారీచుడు (కేటీఆర్), సుబాహుడు (హరీష్ రావు)లను పంపించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే వీరి పని అని విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో “ ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పదేళ్ల దోపిడీ, పాపాల భైరవుడి చరిత్ర అలాగే ఉంటుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆ చరిత్రను కాపాడుతూ, ప్రజలకు గుర్తు చేస్తూ ఉండే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వంటి చిల్లర పనులకు పాల్పడినప్పుడు నోటీసులు ఇవ్వక ఇంకేం చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ చరిత్రను తాను చెరిపివేస్తున్నానన్న విమర్శలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు:దొంగ పాస్పోర్టులు: "కేసీఆర్ దొంగ పాస్పోర్టుల చరిత్రను నేను చెరిపేస్తే చెరిగిపోతుందా?" అని నిలదీశారు.కేసీఆర్పై గతంలో దొంగనోట్ల కేసు నమోదైందని స్వయంగా పక్కనే ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమారే చెప్పారని గుర్తు చేశారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన చరిత్రను ఎవరూ మర్చిపోరన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లు మోదీ అధికారంలో ఉన్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని రేవంత్ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. బీజేపీ నేతలు మోదీని చూసి ఓట్లు వేయమంటున్నారని.. "ఎవరైనా పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తారా?" అని ఆయన ఎద్దేవా చేశారు. గల్లీలో ఉన్న నాయకుడు పనిచేయకపోతే ఢిల్లీలో ఉన్న మోదీని అడగాలా అని ప్రశ్నించారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, బీజేపీ కార్యకర్తలు తమ బీ-ఫామ్లను బీఆర్ఎస్ ఆఫీసు నుంచి తెచ్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!