

తొమ్మిది నెలల విరామం తర్వాత ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సభలో కేవలం మూడు నిమిషాలపాటు మాత్రమే ఉండి వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ హాల్లోకి కేసీఆర్ ప్రవేశించగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం సీఎం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కొంతసేపు మాట్లాడారు. సభ ప్రారంభమైన తరువాత కేసీఆర్ మూడు నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు.
ఈ పరిణామం పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రానున్నారని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, ఆయన సభా చర్చల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారని వారు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, అనర్హత వచ్చే అవకాశం ఉందనే భయంతోనే కేసీఆర్ సంతకం పెట్టేందుకు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీని రాజకీయ ప్రదర్శనల వేదికగా మార్చకూడదు. ఆయన కేవలం అటెండెన్స్ కోసమే హాజరయ్యారు అని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!