
రాజకీయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత వైపు మరింత వేగంగా ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ సేవలో ప్రధాని మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా 2026 మార్చిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!