

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో మాత్రం ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు అన్నీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. దీంతో ఈ గ్రామంలో పోలింగ్ అవసరం లేకుండా పోయింది.
ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వేషన్ కావడంతో, కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నేళ్లుగా పనిచేస్తున్న మల్లేపా కుల వెంకటయ్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. గ్రామంలో ఉన్న మొత్తం 12 వార్డులకు కేవలం 12 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందువల్ల అన్ని పదవులు సమైక్యంగా ఏకగ్రీవం అయ్యాయి. ఈ సందర్భంగా వెంకటయ్య సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ ప్రజలు పరస్పర చర్చలు జరిపి, విభేదాలు లేకుండా ఒకే అభిప్రాయానికి రావడంతో ఈ నిర్ణయం సాధ్యపడిందని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా పోటీ తీవ్రంగా ఉండే వేళ, సీఎం స్వగ్రామం ఇలా ఏకగ్రీవానికి ఉదాహరణగా నిలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!