

జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మేడారం ఏర్పాట్ల పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేణు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మేడారం ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు:
గద్దెల దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దు.
పనుల నాణ్యత పై ఏ మాత్రం రాజీ పడొద్దు.
నిర్మాణాల్లో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వకూడదు.
గద్దెల దగ్గర వరద నీరు నిలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
గద్దెల నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి.
మేడారం ప్రాంతానికి గ్రాండ్ లుక్ వచ్చేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలి.
గుడి చుట్టుపక్కల పచ్చదనం అభివృద్ధి చేయాలి.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (3)
Nice to see CM taking it seriously.
Thoughtful planning for devotees.
మేడారం ఏర్పాట్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా అభినందనీయమైనవి.