
క్రీడలు

బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహిస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దిల్లీలో భారతీయ పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా కాంక్లేవ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ ప్రతిపాదిత వ్యవస్థలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాయింట్లు తగ్గించే విధానం అమల్లోకి వస్తుంది. మొత్తం పాయింట్లు తగ్గినట్లయితే డ్రైవింగ్ లైసెన్సును ఆరు నెలలపాటు సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు ఈ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!