

తిరుమల నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉందని ఎన్డీడీబీ (NDDB) రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనబడిందని ఏపీ ఫైనాన్స్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని, దాని ఫలితంగానే ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. బయటకు వచ్చిన నిజాలనే చంద్రబాబు ప్రజల ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
2022 లో ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందని, అప్పటి నుంచి దానిని కావాలనే తొక్కిపెట్టారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆ రిపోర్ట్లో రెండు కీలక అంశాలున్నాయని, ఒకటి చార్జిషీట్ కాగా మరొకటి ప్రభుత్వానికి పంపిన లేఖ అని వివరించారు. ఇప్పటికే కోర్టులో చార్జిషీట్ దాఖలైందని, ప్రభుత్వానికి పంపిన నోట్లో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు. తిరుమలలో అక్రమాలు తెలిసే జరిగాయని, బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్లపై చర్యలకు సిఫారసు చేసిందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ కూడా స్పష్టం చేసిందని మంత్రి తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!