

రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది సీట్లకే పరిమితమవుతుందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని వారు ఇప్పుడు దేశ అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని విమర్శించారు. నిజామాబాద్లో మంత్రి సీతక్కతో కలిసి కాంగ్రెస్ పార్టీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మతం, కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం భాజపా చేస్తోందని ఆయన ఆరోపించారు. కవిత ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి పాల్గొన్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!