

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనే వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని విశ్వాస పరీక్ష ఓటింగ్లో పాల్గొనవద్దని మద్రాసు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే నేత, మాజీ మంత్రి పెరియ కరుప్పన్పై కేవలం ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లోపాలు జరిగాయని, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ పెరియ కరుప్పన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో 234 సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలం 120 నుంచి 119కి తగ్గనుంది. అయినప్పటికీ బలపరీక్షలో విజయ్కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోనుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!