
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి బలం తీసుకొచ్చింది వారి శక్తివంతమైన క్యాడర్ వ్యవస్థ. ముఖ్యంగా నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన విస్తృత సభ్యత్వ డ్రైవ్ ద్వారా టీడీపీకి కోట్లకు పైగా సభ్యులు చేరడం, పార్టీ స్థాయిని మరింత పెంచింది. గ్రాస్రూట్ స్థాయిలో టీడీపీ బలపడటానికి ఇదే ప్రధాన కారణంగా భావించబడుతోంది.
ఇప్పుడు ఇదే మార్గాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ అనుసరించబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అలాగే పార్టీని ప్రతి స్థాయిలో మరింత బలపరిచేందుకు కొత్త కమిటీల ఏర్పాటుకు దిశానిర్దేశం చేశారు.
బూత్, గ్రామం, మండలం, మున్సిపాలిటీ, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అన్ని అనుబంధ విభాగాల్లో కొత్త కమిటీలను ఏర్పాటు చేసి, పార్టీ గ్రాస్రూట్ కనెక్ట్ను బలోపేతం చేయాలని కేటీఆర్ తెలిపారు.
ఇది లోకేష్ టీడీపీని పునర్నిర్మించేందుకు అనుసరించిన అదే ఫార్ములా. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అమలు చేయబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!