
సినిమాలు

కే. తారక రామారావు, భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంట నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వడ్లు, మొక్కజొన్న పంటలు దెబ్బతినడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు.
ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. వెంటనే ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులకు సహాయం అందించాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆయన విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!