

తన తండ్రి కేసీఆర్ మరియు సోదరుడు కేటీఆర్ల నుండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్పై, హరీష్ రావుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా కవిత కేసీఆర్ పేరును ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడకపోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేడు 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కవిత ఎక్స్లో చేసిన పోస్టులో తన తండ్రి కేసీఆర్ పేరు చెప్పకుండా, ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చింది అని మాత్రమే చెప్పడం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కవితపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ యోధుడు కేసీఆర్ అని చెప్పడానికే కవిత ఇష్టపడడం లేదని, అయితే ఆయన వల్లే కవిత ఇన్నేళ్లు పదవులను అనుభవించిందని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవిత రాజకీయంగా ఎదగడం అసాధ్యం అని, అటువంటి నాయకుడిని సొంత కూతురే పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
కేసీఆర్ ఫోటో లేకుండా కవిత ఎక్స్లో చేసిన పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇన్నాళ్లూ కేసీఆర్ ఇమేజ్ను వాడుకొని రాజకీయాల్లో ఎదిగిన కవిత, ఇప్పుడు స్వతంత్ర ఇమేజ్ ఉన్నట్లు ప్రవర్తిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిజంగా కవితకు స్వతంత్ర శక్తి ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!