
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 14న నిర్వహించాల్సిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం, ఆ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.
రేపటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో, గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల 70 వేల మంది సభ్యత్వం పొందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన జనసేన, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాయిదా వేసి సభ్యత్వాల పెంపుపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించింది.


.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!