

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పులివెందుల లో పర్యటించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
ఈ రోజు సాయంత్రం 4 గంటల కు జగన్ పులివెందుల చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసు లో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడే రాత్రి బస చేస్తారు.
బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందుల లోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. తరువాత బ్రాహ్మణపల్లి కి వెళ్లి అరటి తోటలను పరిశీలించి, రైతులతో సమస్యలపై మాట్లాడతారు. ఆ తర్వాత లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తరువాత తిరిగి పులివెందుల చేరుకున్న తర్వాత, క్యాంప్ ఆఫీసులో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ కొనసాగిస్తారు. ఆ రాత్రి కూడా అక్కడే బస చేసి, గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుండి తిరుగు ప్రయాణం అవుతారు.









.webp&w=3840&q=75)



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!