
బిజినెస్

దేశవ్యాప్తంగా భక్తుల మనసులను కదిలించిన తిరుమల లడ్డూ కలుషిత ఘటనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ టీటీడి ఈవో ధర్మారెడ్డి పాత్రపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తాజా వార్తల ప్రకారం ఆయన అప్రూవర్గా మారి విచారణాధికారులకు కీలక సమాచారం అందజేస్తున్నట్టు తెలుస్తోంది.
వార్తల ప్రకారం ధర్మారెడ్డి కలుషిత నెయ్యి సరఫరా విషయమై ముందుగానే తెలుసునని, సిఎఫ్టిఆర్ఐ నివేదికను కూడా చూశానని అంగీకరించారు. అలాగే ఆర్ డెయిరీ, భోళే బాబా కంపెనీలతో కూడా సంబంధాలు ఉన్నాయని, మాజీ టీటీడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా ఈ విషయమై అవగాహన ఉందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే, ఈ కేసు వైసీపీ నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!