

భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ముందు జరిగిన కీలక చర్చల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం, ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం పూర్తయ్యే వరకు వేచి చూడటానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది. సెప్టెంబరు ప్రారంభంలో జరిగిన సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమై ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.
టారిఫ్లు మరియు వాణిజ్య ఒత్తిడుల విషయంలో భారత్ బెదిరింపులకు తలొగ్గదని డోభాల్ స్పష్టం చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. అలాగే భారత్పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు సమాచారం. ఆ తర్వాత ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. ఈ చర్చలపై అమెరికా అధికారులు వివరాలు వెల్లడించకపోగా, భారత్ కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!