

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని, ఈ కాలమంతా ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. ప్రతివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్, ప్రస్తుత ప్రభుత్వానికి మరో రెండు బడ్జెట్లే మిగిలాయని అన్నారు. రెడ్ బుక్తో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో పాలన సాగుతోందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని చెప్పారు.
‘సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవన్ లేదు… అన్నీ మోసాలే’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలు కళ తప్పాయని, గోరుముద్ద నాణ్యత పడిపోయిందని, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, ప్రస్తుత ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!