

అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావును ప్రశ్నించారు. అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చినా అది చట్టవిరుద్ధమేనని పేర్కొంటూ, తన మామ భూముల విషయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని హరీశ్రావును ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ఓసీ ఇచ్చిందన్న హరీశ్రావు వ్యాఖ్యలపై స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి భూదాన్ భూమిని నకిలీ ఎన్ఓసీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మాజీ మంత్రి గంగుల కమలాకర్ విషయంలోనూ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని పొంగులేటి ఆరోపించారు.
సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలోని భూములపై కూడా పొంగులేటి వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములని, మిగిలినవి ప్రభుత్వ భూములని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22-ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూ అక్రమాలపై పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని, 22-ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుందని పొంగులేటి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!