
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు లేఖ రాశారు. సెప్టెంబర్ 12న శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు ఇప్పటికే బహిరంగంగా స్పందించారు.
మంత్రి పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పీకర్కు వేర్వేరు పిటిషన్లు సమర్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!