
క్రీడలు

సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్పై జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి తమను బెదిరించారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.
మహేందర్ రెడ్డి, మహేష్లను సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో విచారణకు సైఫాబాద్ పోలీసులు పిలిచారు. ఈ సమయంలోనే పోలీస్ స్టేషన్లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై పోలీసుల వాదన భిన్నంగా ఉంది. ఎలాంటి దాడి జరగలేదని, కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్కు వచ్చి వాగ్వాదానికి దిగడంతో వారిని బయటకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!