

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఈ రోజు (ఆదివారం) తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేశామని తెలిపారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి మళ్లీ పాలమూరు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదే విషయంపై త్వరలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ప్రభుత్వ కుట్రలు మరియు జల దోపిడీపై న్యాయ పోరాటం చేస్తారని చెప్పారు. అంతకుముందు నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!