

ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలతో చేసిన సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది. పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా మార్చే ప్రణాళికలు, అలాగే ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, జల్ జీవన్ మిషన్ వంటి ముఖ్య పనులకు ఎంత నిధులు కావాలో ఆర్థికశాఖ పరిశీలిస్తోంది.
మంత్రులు, అధికారులు పాల్గొన్న సమావేశాల్లో ప్రతి ప్రాజెక్టుకు త్రైమాసికాల వారీగా ఎంత ఖర్చు అవుతుందో చర్చించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేసినట్లు, మరో ముఖ్య ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ బిల్లులపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతుందని, వాటికి ఇతర మార్గాల్లో చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానాలపై అవగాహన పెంచేందుకు, కొత్త ఆర్థిక విధానాలను తెలుసుకోవడానికి ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో రీ ఇమాజినింగ్ ఫైనాన్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు ఆర్థికశాఖ ప్రకటించింది










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!