
గాసిప్స్

భారత్–పాక్ క్రికెట్ మ్యాచ్కు ప్రభుత్వ నిధులతో వెళ్లారని వచ్చిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉందని, లోకేశ్ మ్యాచ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వైఎస్సార్సీపీ అనుబంధ మీడియా ప్రచారం చేసింది. ఈ ఆరోపణలను మంత్రి పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన లోకేశ్, ఫ్లైట్ టికెట్ మరియు మ్యాచ్ టికెట్ ఖర్చులు తన వ్యక్తిగత నిధులతోనే చెల్లించానని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, తన డబ్బులతోనే మ్యాచ్ చూసానని, వారి డబ్బులు ఏమైనా ఖర్చు చేశానా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!