

యూట్యూబ్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నా, రాజకీయ రంగంలో మాత్రం అదే స్థాయి ఆదరణ దక్కలేదు. తాజా బీహార్ ఎన్నికల్లో ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్కు ఇదే అనుభవం ఎదురైంది. 9.6 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఈ యూట్యూబర్ భారీ అంచనాలతో రంగంలోకి దిగినా, ఫలితం నిరాశ కలిగించింది.
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన కశ్యప్, సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహిస్తూ తనను ఓ శక్తివంతమైన నాయకుడిగా ప్రజలకు చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. అతని ప్రచారాన్ని చూసి ప్రశాంత్ కిషోర్ కూడా టికెట్ ఇచ్చారు.
అయితే ఓట్ల లెక్కింపు వచ్చేసరికి కశ్యప్ మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్, BJP అభ్యర్థుల కంటే చాలా వెనుకబడి పోయారు. సుమారు 37,000 ఓట్లు సాధించినప్పటికీ, మొత్తం ఫలితాల్లో 50,000 పైగా మెజార్టీతో ఓటమి పాలయ్యారు.
ఈ ఫలితం మరోసారి సూచించినది ఏమంటే— సోషల్ మీడియా హైప్ ఎప్పుడూ ప్రజల అసలు మద్దతును ప్రతిబింబించదు, ముఖ్యంగా రాజకీయాల్లో.





.png&w=3840&q=75)










.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!