

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు ఆదివారం హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం 'గాంధీ భవన్'లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ మహిళ ప్రెసిడెంట్ అల్కా లంబా, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్యలు అటెండ్ అయ్యారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నూతన అధ్యక్షురాలికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వర్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారతకు కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు చేరేలా మహిళా కాంగ్రెస్ వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, మహిళా విభాగం పటిష్టత పార్టీకి మరింత ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!