

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నీట్ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై లోక్సభలో వాయిదా తీర్మానం సమర్పించారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసిన నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!