
రాజకీయాలు

హైదరాబాద్లో నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబాశివరావు, జాతీయ నాయకుడు నారాయణ, ఎమ్మెల్సీ నీలికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ వ్యవహారంపై వెంటనే స్పష్టమైన సమాధానం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని సీపీఐ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, న్యాయం పాటించాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!