

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు నీటి సరఫరా సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, బోర్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ కేంద్రంలో జరిగిన సమీక్షలో పౌర సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచాలని సీఎం సూచించారు. ఏఐ అమలుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేందుకు వర్క్షాప్లు నిర్వహించాలని తెలిపారు. మధ్యప్రదేశ్లో డ్రోన్ల ద్వారా మైనింగ్ పర్యవేక్షణను అధ్యయనం చేసి ఏపీలో అమలు చేసే అవకాశం పరిశీలించాలని అన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సులభతరం కోసం డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీలుగా గుర్తించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
ప్రభుత్వ సేవల్లో వినూత్న ఆలోచనలు తీసుకురావాలని, పథకాల అమలు పర్యవేక్షణకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం సూచించారు. రైతులకు ధరల విషయంలో ఇబ్బందులు రాకుండా మార్కెట్ విశ్లేషణ చేయాలని, ఆన్లైన్ సేవలను విస్తరించాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పార్థసారథి, సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!