

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆషాడ బోనాల ఉత్సవాల బుక్లెట్ను మంత్రులు ఆవిష్కరించగా, జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, జగదాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఎల్నినో ప్రభావం తగ్గి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, పెద్ద దేవాలయాలతో పాటు చిన్న ఆలయాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!