
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనలు దేశ ఐక్యతను దెబ్బతీయలేవని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన అమరులను ఆయన స్మరించుకున్నారు. వారి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
ఇలాంటి దుష్ట కుట్రలు ఎప్పటికీ సఫలం కావని, దేశ ప్రజలు ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం వారి వెంట ఉందని భరోసా ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!