

సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ ఏజెన్సీలు, రహదారి భద్రతా నిధులు, క్రాష్ బారియర్లు, డ్రైవర్ల శిక్షణా కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు పురోగతిని సమీక్షించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మరణించినట్లు, వీటిలో ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల వివరాల ప్రకారం, 79% ప్రమాదాలు వేగం కారణంగా, 3% రాంగ్ డ్రైవింగ్, 1% మద్యం/మొబైల్ ఫోన్ కారణంగా చోటుచేసుకున్నాయి.
స్పీడ్ గవర్నర్లు, సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు, రోడ్ మార్కింగ్, క్రాష్ బారియర్లు, అనధికారిక వాహన మార్పుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే, వాహనాలను హెచ్చరికల తర్వాత సీజ్ చేయడం, అకస్మాత్తు ప్రమాదాల సమయంలో 108 అంబులెన్సులు సమన్వయం, ప్రతి ఏడాది రోడ్ సేఫ్టీ awareness కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!